Publish Date: Sat, 04 Jan 2025 (12:07 IST)
Updated Date: Sat, 04 Jan 2025 (12:09 IST)
కాకినాడ పోర్టు కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ, వివిధ కారణాల వల్ల విజయసాయిరెడ్డి విచారణకు హాజరుకాలేదు. తాజా నోటీసులో, సోమవారం విచారణ కోసం తమ అధికారుల ముందు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది.
కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్, ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో కర్నాటి వెంకటేశ్వరరావు వద్ద ఉన్న వాటాలను విజయసాయిరెడ్డి బలవంతంగా స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలపై ఈ కేసు ఉంది. కర్నాటి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు చేపట్టగా, మనీలాండరింగ్లో విజయసాయిరెడ్డి ప్రమేయం ఉన్నట్లు తెలిపే ఆధారాలు లభించినట్లు సమాచారం. దీంతో తాజాగా విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి.
అయితే గతంలో ఇచ్చిన నోటీసులపై ఎంపీ స్పందిస్తూ.. విచారణకు హాజరు కాలేకపోవడానికి పలు కారణాలను తెలిపారు. తాజా సమన్లను ఆయన పాటించి ఈడీ ఎదుట విచారణకు హాజరవుతారో లేదో చూడాలి.