Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిత్తూరులో భూప్రకంపనలు - భయాందోళనకుగురైన ప్రజలు

చిత్తూరులో భూప్రకంపనలు - భయాందోళనకుగురైన ప్రజలు
, మంగళవారం, 23 నవంబరు 2021 (14:46 IST)
చిత్తూరు జిల్లాలో మంగళవారం భూప్రకంపనలు సంభవించాయి. దీంతో స్థానిక ప్రజలు భయంతో తమ ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీశారు. జిల్లాలోని ఏటీవన్, ఉప్పరపల్లి, కమ్మపల్లి, శిలంవారిపల్లి, ఎస్వీ ఎడ్లపల్లి, ఎస్వీ దళితవాడ, నంజేంపేట దిగువీధి ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ భూ ప్రకంపనలు కనిపించాయి. 
 
ఈ ప్రకంపనల ధాటికి నిలబడిన వ్యక్తులు ఒక్కసారిగా కిందపడిపోయాడు. అలాగే, శబ్దాలతో గోడలకు పగుళ్లు రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. కొన్ని చోట్ల ఇళ్ళలో వంటింట్లోని పాత్రలు కిందపడిపోయాయి. కొన్ని సెకన్ల పాటు ఈ ప్రపంకనలు కనిపించాయి. ఆ తర్వాత పరిస్థితి చక్కబడటంతో ప్రజలంతా ఊపిరిపీల్చుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరద బాధిత కడప జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు