Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో ఎప్పుడు ఏ జిల్లాలో ఎంత ఉష్ణోగ్రత నమోదు కాబోతోందో తెలుసా?

ఏపీలో ఎప్పుడు ఏ జిల్లాలో ఎంత ఉష్ణోగ్రత నమోదు కాబోతోందో తెలుసా?
, శుక్రవారం, 22 మే 2020 (08:39 IST)
ఐఎండి వాతావరణ శాఖ  సూచనల ప్రకారం మే  22 నుంచి 25  వరకు నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ ఉష్ణోగ్రతలు  నమోదయ్యే అవకాశం ఉంది.
 
☀ మే   22
శ్రీకాకుళం , విజయనగరం ,  విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో  కొన్ని ప్రాంతాల్లో 45°C-47°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. పశ్చిమగోదావరి, క్రిష్ణా , గుంటూరు , ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో  కొన్ని ప్రాంతాల్లో 43°C-44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కడప ,అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 41°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
 
☀ మే   23
విశాఖపట్నం, క్రిష్ణా, గుంటూరు , ప్రకాశం, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46°C-48°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.  విజయనగరం ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43°C-45°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.  శ్రీకాకుళం, కడప, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
 
☀ మే   24
విజయనగరం, విశాఖపట్నం,  క్రిష్ణా, గుంటూరు , ప్రకాశం, నెల్లూరు, జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 44°C-46°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C  - 43°C  ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.  శ్రీకాకుళం, కడప, అనంతపురం , కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 39°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.   
 
☀ మే   25
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో  కొన్ని ప్రాంతాల్లో 43°C-44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విజయనగరం ,  విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా , గుంటూరు , కడప ,అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 41°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాల్లో  కొన్ని ప్రాంతాల్లో 38°C-39°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
 
విపత్తుల నిర్వహణశాఖ జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రజలు కుడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు.
 
వడగాలుల బారిన పడకుండా మహిళలు, పిల్లలు, వృద్దులు సరైన జాగ్రత్తలు  తీసుకోవాలని కోరారు. మిమ్మల్ని మీరు డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్, ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలి. మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రజల సంతోషం గురించి ఆలోచించే నాయకుడు జగన్: మంత్రి ముత్తంశెట్టి