Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైసిపి కార్యాలయంగా డిజిపి ఆఫీస్‌ : నక్కా ఆనంద్‌బాబు

వైసిపి కార్యాలయంగా డిజిపి ఆఫీస్‌ : నక్కా ఆనంద్‌బాబు
, సోమవారం, 20 సెప్టెంబరు 2021 (07:04 IST)
డిజిపి కార్యాలయం వైసిపి కార్యాలయంగా మారిపోయిందని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు.

విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుడి ఇంటిపైకి హత్యయత్నానికి వెళ్లిన ఎమ్మెల్యేకు 151 నోటీస్‌ ఇచ్చి పంపారన్నారు. తమ నాయకులపై మాత్రం ఎస్సి,ఎస్టి కేసు పెట్టారని తెలిపారు.

అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడికి విన్నవించేది ఏముంటుందని ఆయన నిలదీశారు. ఈ దారుణంపై పోలీస్‌ వ్యవస్థ సిగ్గుపడాలని నక్కా పేర్కొన్నారు.
 
గత రెండు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న విపరీణమలు ప్రజలు అందరూ గమనిస్తున్నారని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజా స్వామ్యం ఉందా?, వ్యవస్దలు పనిచేస్తు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు.

ప్రతిపక్ష నాయకుడి ఇంటికి దాడి వెళ్ళి మళ్ళీ దానిని సమర్దించుకోవడం సిగ్గు మాలిన చర్యన్నారు. పోలీసులు వాళ్ళ చర్యలను సమర్దించడం దుర్మార్గమన్నారు. డీజీపీ ఆఫీసుకు వైసీపీ రంగులు వేసుకోవాలన్నారు.

నా భూతో.. నా భవిష్యతు అన్నట్టు ఈ ప్రభుత్వంలో ఎన్ని భూతులు తిడితే.. మీ భవిష్యతు అంతా బాగుంటుంది అనే రీతిలో ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం రాజ్యంగం ఇచ్చిన జీవించే హక్కును హరిస్తుందని మండిపడ్డారు.

టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జోగి రమేష్  మరియు ఆ రోజు దాడికి వచ్చిన వారిపై హత్య యత్నం కేసు నమోదు చేయాలని సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీడీపీని ప్రజలు ఛీ కొడుతున్నారు... గుర్తించకపోతే వారి ఖర్మ: అంబటి రాంబాబు