Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తరుముకొస్తున్న 'జవాద్' - ఆ ఐదు రాష్ట్రాలకు భారీ వర్షాలు

తరుముకొస్తున్న 'జవాద్' - ఆ ఐదు రాష్ట్రాలకు భారీ వర్షాలు
, శుక్రవారం, 3 డిశెంబరు 2021 (14:58 IST)
బంగాళాఖాతంలో  ఏర్పడిన వాయుగుండం మరింత బలపడింది. శుక్రవారం ఉదయానికి విశాఖపట్టణానికి 960 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే, మధ్యాహ్నం 3 మూడు గంటలకు 420 కిలోమీటర్ల దూరంలో వుంది. 
 
అలాగే, ఒడిశా రాష్ట్రంలోని పరదీప్‌కు ఆగ్నేయంగా 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుంది. అదేసమయంలో ఈ తుఫాను ప్రభావం కారణంగా గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
ఇదే అంశంపై భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ ఎం. మహాపాత్ర స్పందిస్తూ, జవాద్ తుఫాను ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ వర్షాలు ఈ నెల 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కురుస్తాయి. 
 
ఈ తుఫాను ఈ నెల 4వ తేదీ శనివారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒరిస్కా మధ్య తీరం దాటొచ్చని అంచని ఓ ప్రైవేటు వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ కారణంగా ఉత్తర కోస్తా, ఒరిస్సా తీర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
ముఖ్యంగా, ఏపీలోని విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమై ఆ మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారును కూడా నియమించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో 40 అనుమానిత ఒమిక్రాన్ కేసులు - 10 మంది ముంబైకర్లకు పాజిటివ్