Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీ నుంచి రెండున్నర గంటల్లో తిరుపతికి...స్పైస్ జెట్ విమాన సర్వీసు

ఢిల్లీ నుంచి రెండున్నర గంటల్లో తిరుపతికి...స్పైస్ జెట్ విమాన సర్వీసు
విజ‌య‌వాడ‌ , సోమవారం, 18 అక్టోబరు 2021 (10:10 IST)
స్పైస్‌ జెట్ ఢిల్లీ-తిరుపతి మధ్య నాన్‌స్టాప్ విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. సహాయ మంత్రులు జనరల్ వీకే సింగ్, ప్రహ్లాద్ పటేల్, స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్‌ జెండా ఊపి నిన్న విమాన సేవలను ప్రారంభించారు.
 
అనంతరం సింధియా మాట్లాడుతూ, ఢిల్లీ-తిరుపతి మధ్య ప్రస్తుతం బుధవారం, శుక్రవారం, ఆదివారం సర్వీసులు నడుస్తాయని, ఈ నెల 31 తర్వాత వారంలో నాలుగు రోజులు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మే 2022 నాటికి తిరుపతి రన్‌వే విస్తరణ పనులు పూర్తి చేసి వైట్ బాడీ అంతర్జాతీయ విమానాలు ల్యాండ్ అయ్యేలా చూస్తామన్నారు.
 
తిరుపతి విమానాశ్రయం ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ముంబై, హైదరాబాద్, బెంగళూరు, బెళగావి, కలబురిగి, కొల్హాపూర్ నుంచి తిరుపతికి నేరుగా విమానాలు నడుస్తున్నాయి. ఢిల్లీ నుంచి ఇదే తొలిసారి. ఈ రెండు నగరాల మధ్య 2,160 కిలోమీటర్లు కాగా, విమానంలో రెండున్నర గంటల్లో చేరుకోవచ్చు.  రైల్వే రెండో తరగతి ఏసీ చార్జీల కంటే తక్కువ ధరకే విమాన సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెణికిన న‌రం... మెగా స్టార్ చిరంజీవి చేతికి శస్త్ర చికిత్స