Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

న‌వంబ‌రు 4న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థానం

న‌వంబ‌రు 4న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో దీపావళి ఆస్థానం
, మంగళవారం, 26 అక్టోబరు 2021 (20:02 IST)
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో న‌వంబ‌రు 4వ తేదీ దీపావళి సందర్భంగా సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఆస్థానం జ‌రుగ‌నుంది. ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవల్లి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు.
 
న‌వంబ‌రు 2న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం :
దీపావళి ఆస్థానం సంద‌ర్భంగా ఆలయంలో న‌వంబ‌రు 2వ‌ తేదీ మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించ‌డం ఆన‌వాయితీ. ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది.

ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 9.00 గంటల నుండి దర్శనానికి అనుమతిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సివిల్‌ వివాదాల్లో పోలీసుల జోక్యమా?: హైకోర్టు