Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీతో డీలర్స్ అసోసియేషన్ భేటీ

Advertiesment
పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీతో డీలర్స్ అసోసియేషన్ భేటీ
, శుక్రవారం, 8 మే 2020 (22:54 IST)
రాష్ట్ర రేషన్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర మరియు విజయవాడ అధ్యక్షుడు మండాది వెంకట్రావు నేతృత్వంలో రాష్ట్ర, విజయవాడ, కృష్ణా జిల్లా కమిటీ సభ్యులు రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీ సూర్య కుమారిని కలవడం జరిగింది.

3 విడతల కమిషన్ మంజూరు గురించి వినతిపత్రం సూర్య కుమారికి ఇవ్వడం జరిగింది. వినతిపత్రం తీసుకున్న మేడం వెంకట్రావుతో మాట్లాడుతూ కొద్దీ రోజుల క్రితం మీరు కమిషన్ మంజూరు గురించి అడిగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం మార్చ్ 29 పంపిణీ కమిషన్ డీలర్స్ ఎస్సీఎం ఖాతా లో 24 గంటల్లో వేస్తున్నామని చెప్పారు.

4వ విడత షుగర్, ఆటా కు మీరు డీడీలు చెల్లించకుండా ఉంటే ఎస్సీఎంలో ఉన్న కమిషన్ అడ్జెస్ట్ అవుతుందని చెప్పారు. మిగిలిన 2 విడతల కమిషన్ మరో వారం రోజుల్లో ఇస్తామని హామీ ఇచ్చారు.

అలాగే డీలర్స్ గన్నీ లను ప్రభుత్వానికి ఇవ్వాలని, 16 రూపాయలు ఇస్తామని , ధాన్యం, మొక్కజొన్న తదితర పంటల సేకరణ కు ఇబ్బందిగా ఉందని చెప్పారు.

డీలర్స్ సానుకూలంగా ఉంటూ ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. కనుక డీలర్స్ 4వ విడత పంపిణీ కి వెళ్లాలని సరుకు దింపుకోవాలని డీలర్స్ కు తెలపడమైనది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వగ్రామాలకు పంపాలంటూ వలస కార్మికుల ఆందోళన