Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానం

ఏపీలో ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానం
, గురువారం, 28 జులై 2022 (11:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రజా ఉపయోగ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఫ్యామిలీ డాక్టర్ పేరుతో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో ప్రతి కుటుంబానికి ఓ ఫ్యామిలీ డాక్టర్ వైద్యసేవలను అందుబాటులోకి తేవాలన్నదే ఈ పథకం లక్ష్యమన్నారు. 
 
ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ విధానంపై ఈ నెల 26వ తేదీన మాస్టర్ ట్రైనర్లకు వర్క్‌షాపు నిర్వహించామని ఆయన తెలిపారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడికి శాశ్వతమైన మొబైల్ నంబరును కేటాయించనున్నట్టు తెలిపారు. 2022 డిసెంబరు నాటుకి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్‌లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్టీఏ ఉద్యోగినిపై హోం గార్డు అత్యాచారం.. ఎక్కడ?