Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం సార్, రైల్వేకోడూరు టికెట్ ఇప్పిస్తామని రూ.7 కోట్లు తీసుకున్నారు: బాబుకి టీడిపి కార్యకర్త వీడియో

Advertiesment
Sudhamadhavi

ఐవీఆర్

, శనివారం, 8 నవంబరు 2025 (21:26 IST)
తనకు రైల్వే కోడూరు తెదేపా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామని చెప్పి వేమన సతీష్ అనే వ్యక్తి తమ నుంచి రూ. 7 కోట్లు తీసుకున్నాడంటూ తెదేపా కార్యకర్త సుధా మాధవి ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ... ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామని చెబితే అతడిని నమ్మి తాతల నాటి ఆస్తిని అంతా అమ్మి రూ. 7 కోట్లు ఇచ్చాము. ఐతే టికెట్ రాకపోగా తమ డబ్బు తిరిగి ఇవ్వమంటే చంపేస్తామని బెదిరిస్తున్నారు.
 
విషయం చెప్పేందుకు టీడీపి కార్యాలయానికి వెళ్లడానికి ప్రయత్నం చేస్తే తమని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు. డబ్బులు అడిగితే చంపేస్తామని బెదిరించారు. వారి నుంచి తప్పించుకుని రహస్య జీవితం గడుపుతున్నాం. వేమన సతీష్ నుంచి నాకు, నా పిల్లలకు ప్రాణ హాని వుంది. సీఎం సార్... ప్లీజ్ మమ్మల్ని కాపాడండి. మా డబ్బులు మాకు ఇప్పించండి సార్. మాకు న్యాయం చేయండి... అంటూ బోరున విలపించింది సుధా మాధవి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిపోర్ట్ వచ్చేవరకూ ఆ 2000 కోళ్లను ఎవ్వరూ తినొద్దు