Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆడవాళ్లు వంటలు మానేశారు.. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు తింటున్నారు : ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు (Video)

ksns raju

ఠాగూర్

, బుధవారం, 21 ఆగస్టు 2024 (13:40 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల వల్ల ఆడవాళ్లు బాగా చెడిపోయారని చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు అన్నారు. ఆయన తన అనుచరులతో మాట్లాడుతూ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమల్లోకి తెస్తున్నారన్నారు. ఈ ప‌థ‌కాల వ‌ల్లే, ఆడ‌వాళ్లు ఇంట్లో వంట మానేసి, ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీకి అల‌వాటు ప‌డుతున్నారన్నారు. 
 
అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా బ‌ట్ట‌లు కొనుక్కుంటున్నారు. ఏటీఎంల‌కు వెళ్లి డ‌బ్బులు తీసి మందు తాగుతున్నారంటూ వ్యాఖ్యానించారు. చంద్రద్రబాబు అనవసరంగా స్కీములు పెట్టారని, ప్రజల ఖాతాల్లో డబ్బులు వెయ్యొద్దని సీఎం చంద్రబాబుకు కోరినట్టు చెప్పారు. ప్రజల ఖాతాలో డబ్బులు వేస్తే డాబాలకు వెళ్లి బిరియానీలు తింటున్నారని, ఇంట్లో వంటలు చేయడం మానేశారని చెప్పారు. అందువల్ల ప్రభుత్వం ఉచిత పథకాలను రద్దు చేయాలని ఆయన పరోక్షంగా సూచించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ఇపుడు నెట్టింట వైరల్ అయ్యాయి. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైలు ప్రమాదాల నివారణకు ఏఐ టెక్నాలజీ : రైల్వే బోర్డు నిర్ణయం