Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అంబులెన్స్‌ల కొనుగోలుపై ఆరోపణలు సరికాదు: ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి

అంబులెన్స్‌ల కొనుగోలుపై ఆరోపణలు సరికాదు: ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి
, గురువారం, 2 జులై 2020 (17:16 IST)
అంబులెన్స్‌ల కొనుగోలుపై ప్రతిపక్ష నేతలు అవినీతి ఆరోపణలు చేయడం సరైంది కాదని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి మండిపడ్డారు. 

గురువారం చిత్తూరు జిల్లాలో  104, 108, నియోనెటర్ అంబులెన్స్ సర్వీసులను ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ..  ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి ఏపీ సీఎం అని అన్నారు. 

ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకే అత్యాధునికమైన అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలను అందిస్తున్నామని నారాయణ స్వామి తెలిపారు. 
 
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతలు విమర్శలు చేసే ముందు నిజాలేంటో తెలుసుకోవాలని హితవు పలికారు. కరోనా వైరస్ ప్రబలకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందని మంత్రి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొత్తం కరోనా కేసులు 6 లక్షలు.. కానీ యాక్టివ్ కేసులు 2.26 లక్షలు మాత్రమే