Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అత్యాచారాన్ని చిత్రీకరించి షేర్ చేయడం దారుణం... నన్నపనేని

మహిళా కమీషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమధ్య విశాఖపట్టణం నడిరోడ్డులో ఓ మహిళపై యువకుడు అత్యాచారానికి పాల్పడితే, దాన్ని చూసినవారు సెల్ ఫోనులో చిత్రీకరించి దాన్ని షేర్ చేయడం నీతిబాహ్యమై

అత్యాచారాన్ని చిత్రీకరించి షేర్ చేయడం దారుణం... నన్నపనేని
, శనివారం, 28 అక్టోబరు 2017 (11:41 IST)
మహిళా కమీషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమధ్య విశాఖపట్టణం నడిరోడ్డులో ఓ మహిళపై యువకుడు అత్యాచారానికి పాల్పడితే, దాన్ని చూసినవారు సెల్ ఫోనులో చిత్రీకరించి దాన్ని షేర్ చేయడం నీతిబాహ్యమైన చర్య అనీ, దారుణమైనదని అన్నారు. 
 
ఇలాంటి సంఘటనలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అభ్యంతరకరమని అన్నారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాసినట్లు తెలిపారు. వాట్స్ యాప్, ఫేస్ బుక్ లపై నియంత్రణ విధించాలని ఆమె కోరినట్లు వెల్లడించారు. మహిళలపై ఇటీవల జరుగుతున్న అత్యాచారాలను ఫేస్ బుక్, వాట్స్ యాప్ లలో దర్శనమివ్వడం ఎక్కువైంది. ఈ మాధ్యమాల ద్వారా అత్యాచారం దృశ్యాలను షేర్ చేయడంపై నిరోధించాలని నన్నపనేని విజ్ఞప్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జన్‌ధన్‌ ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులేస్తుందట : వరల్డ్ బ్యాంక్ సర్వేలో వెల్లడి