Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నరసారావు పేటలో వ్యక్తి దారుణ హత్య.. కల్యాణ్‌ జ్యువెలరీలో పనిచేసే?

crime scene
, శనివారం, 23 ఏప్రియల్ 2022 (13:46 IST)
నరసారావు పేటలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న ఈ హత్యకు గురైంది కల్యాణ్‌ జ్యువెలరీ దుకాణంలో పనిచేసే రామాంజనేయులుగా గుర్తించారు. 
 
భర్త అపహరణపై నిన్న పోలీసులకు రామాంజనేయులు భార్య ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
 
ఈ నేపథ్యంలోనే రామాంజనేయులు కిడ్నాప్, హత్య జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద హత్యకు గురైన రామాంజనేయులు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
రామాంజనేయులును తీవ్రంగా కొట్టి కాల్వలో వేసి కాళ్ళతో తొక్కి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌లో ఇద్దరు విద్యార్థులు మృతి