Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌ విద్యార్థులు మృతి

road accident
, శనివారం, 23 ఏప్రియల్ 2022 (13:26 IST)
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాదుకు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. చికాగో సమీపంలోని అలెగ్జాండర్‌ కౌంటీ వద్ద గురువారం తెల్లవారుజామున 4.15 గంటలకు ఈ ఘటన జరిగింది. 
 
పిక్నిక్‌కు వెళ్తున్న విద్యార్థుల కారును ఎదురుగా వస్తున్న మరో కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నిజాంపేటలో నివాసముండే జేఎన్‌టీయూ ప్రొఫెసర్‌ పద్మజా రాణి చిన్న కుమారుడు పీచెట్టి వంశీకృష్ణ(23), అతని స్నేహితుడు పవన్‌ స్వర్ణ(23) అక్కడికక్కడే మృతి చెందారు. 
 
అదే కారులో ఉన్న వారి స్నేహితులు డి.కల్యాణ్‌, కె.కార్తీక్‌, ఉప్పలపాటి శ్రీకాంత్‌లకు గాయాలయ్యాయి. చికాగోలోని ఓ ఆస్పత్రిలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ తరహాలో తమిళనాడులో గ్రామ సచివాలయాలు.. స్టాలిన్ ప్రకటన