Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వన్ టైమ్ సెటిల్మెంట్ పథకంపై విమర్శలా.. బొత్స ఫైర్

Advertiesment
వన్ టైమ్ సెటిల్మెంట్ పథకంపై విమర్శలా.. బొత్స ఫైర్
, బుధవారం, 1 డిశెంబరు 2021 (17:50 IST)
ఏపీ సర్కారు ప్రవేశపెట్టిన వన్ టైమ్ సెటిల్మెంట్ పథకంపై విమర్శలు గుప్పించే టీడీపీపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గతంలో ఇళ్ల పట్టాల విషయంలో కూడా టీడీపీ ఇలాగే అడ్డుకునే ప్రయత్నం చేసిందని చెప్పారు. 
 
ఈ పథకం ప్రభుత్వం సొంతంగా తీసుకొచ్చింది కాదని... పాదయాత్ర సమయంలో ప్రజలు వచ్చి అడిగినందుకే తీసుకొచ్చామని తెలిపారు. స్వచ్ఛందంగా వచ్చే వారికే రిజిస్ట్రేషన్ చేస్తామని వెల్లడించారు.పేదల కోసం తెచ్చే మంచి పథకాలను కూడా టీడీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు.  
 
పంచాయతీ సెక్రటరీ విడుదల చేసిన ఉత్తర్వుల వెనుక టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఉండొచ్చని బొత్స అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్దేశాలకు విరుద్ధంగా టెక్కలి నియోజకవర్గంలోని ఓ పంచాయతీ కార్యదర్శి ఉత్తర్వులను విడుదల చేశారని... ఆ విషయం తెలిసిన వెంటనే అతన్ని సస్పెండ్ చేశామని బొత్స గుర్తు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ ముగ్గురు వైకాపా నేతలను లేపేస్తే రూ.50 లక్షల రివార్డు : మల్లాది వాసు