Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బొర్రా గుహలకు టిక్కెట్ల ధరల్లో స్వల్ప మార్పు

బొర్రా గుహలకు టిక్కెట్ల ధరల్లో స్వల్ప మార్పు
, బుధవారం, 23 అక్టోబరు 2019 (15:47 IST)
అనంతగిరి (అరకులోయ): మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బొర్రాగుహలకు ప్రవేశాల టికెట్‌ ధరల్లో పర్యాటక శాఖ స్వల్ప మార్పులు చేసింది.

ప్రస్తుతం అమలవుతున్న ధరల కాస్త మార్చుతూ బుధవారం నుంచి నూతన ధరలను అందుబాటులోకి తేనుంది. ప్రసుత్తం పెద్దలకు రూ.60, చిన్న పిల్లలకు రూ.45, వీడియో కెమెరాకు రూ.100, సెల్‌ఫోన్‌కు రూ.25 టిక్కెట్‌ ధర ఉండేది. 
 
వీటిని మారుస్తూ పెద్దలకు రూ.70, పిల్లలకు రూ. 50 చేశారు. వీడియె కెమెరాకు గతంలో ఉన్న రూ.100 నే ఉంచగా, సెల్‌ఫోన్‌కు టికెట్‌ ధర రద్దుచేస్తూ పర్యాటకశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నూతన ధరలు 23 నుంచి అమలవుతున్నట్లు అధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫోటోలు తీసిన నాసా ఆర్బిటర్.. అయినా విక్రమ్ జాడ కనిపించలేదు..