Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభుత్వోద్యోగులకు బయోమెట్రిక్ తప్పనిసరి

Advertiesment
Biometric
, మంగళవారం, 24 ఆగస్టు 2021 (17:01 IST)
ప్రభుత్వోద్యోగులకు బయోమెట్రిక్ హాజరును ఇక నుంచి తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వ ఆదేశాలు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ ఆదిత్య నాథ్ దాస్. 
 
కరోనా కారణంగా 2020 మే నెల నుంచి బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం… ఈ నెల 13 తేదీన జరిగిన కార్యదర్శుల సమావేశంలో బయోమెట్రిక్ హాజరును తప్పని సరిగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
 
సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న బయోమెట్రిక్ పరికరాలను తిరిగి సిద్ధం చేయాలని ఐటీ శాఖను ఆదేశించారు సీఎస్. సచివాలయం సహా హెచ్ఓడి కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, స్యయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, రాష్ట్ర విభాగాలు తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 
 
బయోమెట్రిక్ హాజరు నమోదుకు నెలవారిగా నివేదికలను ప్రభుత్వానికి పంపాలని సూచనలు జారీ చేశారు. ప్రతీ శాఖ కార్యదర్శి ఉద్యోగుల హాజరును బయోమెట్రిక్ ద్వారా పరిశీలించాలని సూచనలు చేశారు సిఎస్. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కార్యదర్శులు, జిల్లా కలెక్టర్ లకు ఆదేశాలను జారీ చేశారు సీఎస్ ఆదిత్య నాథ్ దాస్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెరాస ధూంధాం కార్యక్రమం.. దివ్యాంగుడిపై తెరాస నేత దాష్టీకం