Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభుత్వ స్కూల్‌లో కరోనా కలకలం: ఏపీలో కరోనా అప్డేట్

ప్రభుత్వ స్కూల్‌లో కరోనా కలకలం: ఏపీలో కరోనా అప్డేట్
, శనివారం, 21 ఆగస్టు 2021 (20:33 IST)
ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ స్కూల్‌లో కరోనా కలకలం రేపింది. వారం కిందట ఏపీలో పాఠశాలలు తెరుచుకోవటంతో చిన్నారులు బడిబాట పట్టారు. ప్రకాశం జిల్లాలోని నాలుగు జడ్పీ హైస్కూళ్లలో విద్యార్థులతోపాటు, ఉపాధ్యాయులకు కరోనా సోకింది. ఒంగోలు డీఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాలలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు..పలు పాఠశాలల్లో చికిత్స శిబిరాలను ఏర్పాటు చేశారు.
 
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత కిందకు దిగింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 61,678 శాంపిల్స్ పరీక్షించగా.. 1,217 మందికి పాజిటివ్‌‌గా తేలింది. మరో 13మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు. 
 
ఇదే సమయంలో 1,535 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్‌ టెస్ట్‌ల సంఖ్య 2,60,34,217కు పెరగగా... మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,01,255కు చేరింది. ఇప్పటి వరకు 19,72,399 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక, కోవిడ్‌ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 13,715కు పెరగగా.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 15,141కు చేరుకున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజాకు జగనన్న ఆశీస్సులు, ఎందుకో తెలుసా?