Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్త్రీపురుషులను ఒకే గదిలో నిర్బంధిస్తారా? చంద్రబాబు ఫైర్

స్త్రీపురుషులను ఒకే గదిలో నిర్బంధిస్తారా? చంద్రబాబు ఫైర్
, బుధవారం, 16 సెప్టెంబరు 2020 (19:58 IST)
ఓ వైసీపీనేత ఫిర్యాదు చేశాడని కృష్ణా జిల్లా జగ్గయ్య పేట మండలం జయంతిపురం గ్రామానికి చెందిన భూక్యా కుటుంబీకులను ఏడేళ్ల చిన్నారితో సహా చిల్లకల్లు పోలీసు స్టేషన్‌కు తెచ్చి నిర్బంధించారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు. కొంతమంది పోలీసులు తాము అమలు చేయాల్సిన చట్టాలను వదిలేసి వైసీపీ నేతల మాటే చట్టంగా వ్యవహరించడం దారుణమని తెలిపారు.
 
ఈ సందర్భంగా భూక్యా కుటుంబ సభ్యులు పీఎస్‌లో ఓ గదిలో ఉన్న ఫోటోలను చంద్రబాబు షేర్ చేశారు. ఆ గదిలో చిన్నారి కూడా ఉండటం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చిన్నారిలో మీకు ఏ నేరస్తుడు కనిపించాడు? స్త్రీ పురుషులను ఒకే గదిలో నిర్భంధించమని ఏ చట్టం చెబుతుందని మండిపడ్డారు.
 
కోవిడ్ నిబంధనలు పేరిట టీడీపీ వాళ్లను ఇబ్బంది పెట్టే మీకు ఇలా గుంపుగా అందరినీ ఒకచోట నిర్బంధించడానికి ఏ వైసీపీ చట్టం అనుమతించిందని ప్రశ్నించారు. కోర్టులు వేలెత్తి చూపినా మీ తీరు మారదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

11,600 మార్కును దాటిన నిఫ్టీ, 250 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్