Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

త్వ‌ర‌లోనే టీటీడీ స‌హా దేవాదాయ ట్ర‌స్టు బోర్డుల నియ‌మ‌కం

త్వ‌ర‌లోనే టీటీడీ స‌హా దేవాదాయ ట్ర‌స్టు బోర్డుల నియ‌మ‌కం
, మంగళవారం, 27 జులై 2021 (15:29 IST)
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం స‌హా త‌ర‌లో ఏపీలోని అన్ని ట్ర‌స్టు బోర్డుల‌ను నియ‌మిస్తామ‌ని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు తెలిపారు. దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖ ప‌రిధిలోని ట్ర‌స్టు బోర్డుల నియ‌మ‌కం త్వ‌ర‌లో పూర్తి చేయాల‌ని దేవ‌దాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిని అదేశించారు.

దేవ‌దాయ ధ‌ర్మ‌ధాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాల‌యంలో మంత్రి అధ్య‌క్ష‌త‌న అధికారుల స‌మీక్ష స‌మావేశం జ‌రిగింది. స‌మావేశంలో దేవ‌దాయ శాఖ ముఖ్యకార్య‌ద‌ర్శి, క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ జి వాణి మోహ‌న్‌, అద‌న‌పు క‌మిష‌న‌ర్ చంద్ర‌కుమార్, రీజ‌న‌ల్ జాయింట్ క‌మిష‌న‌ర్ ఆజాద్‌,  భ్ర‌మ‌రాంభ త‌దిత‌రులు ఉన్నారు.

సీఎం జ‌గ‌న్ మెహ‌న్ రెడ్డి అదేశాల‌తో ఇప్ప‌టికే చాలా దేవాల‌యాల‌కు ట్ర‌స్టు బోర్డుల నియ‌మ‌కం జ‌రిగింద‌ని, మిగిలిన ట్ర‌స్టు బోర్డుల నియ‌మ‌కం కూడా త‌ర్వ‌త‌గ‌తిన పూర్తి చేయాల‌ని అధికారుల‌కు మంత్రి అదేశించారు. అదే విధంగా దేవ‌దాయ శాఖ ప‌రిధిలో ఉద్యోగుల ప్ర‌మోష‌న్ విష‌యంలో కూడా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు.

ఉద్యోగుల ప్ర‌మోష‌న్ విష‌యంలో కొర్టు వివాదాలు లేకుండా న్యాయ‌ప‌ర‌మైన అంశాల‌ను ప‌రిశీలించి చాలా కాలంగా ప్ర‌మోష‌న్ కోసం  వివిధ స్థాయిలో ఉన్న‌వారికి న్యాయం జ‌రిగే విధంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. అధికారుల‌ను మంత్రి పాలనప‌ర‌మైన అంశాల‌ను అడిగి తెలుసుకుని, ప‌లు సూచ‌న‌లు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాన్సాస్ ట్రస్ట్ ఈవోకు హైకోర్ట్ అక్షింతలు