Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం జ‌గ‌న్ కు బుద్ధి ప్ర‌సాదించాల‌ని విగ్నేశ్వరుడికి వినతిపత్రం

Advertiesment
ap
విజయవాడ , శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (10:58 IST)
ఏపీలో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై తెలుగుదేశం నాయ‌కులు ముప్పేట దాడి చేస్తున్నారు. ఆయ‌న ప్ర‌తి అడుగునూ త‌ప్పుప‌డుతూ, రాష్ట్రంలో జ‌రిగిన ప్ర‌తి సంఘ‌ట‌న‌ను ఆయ‌న‌కే ఆపాదిస్తున్నారు. వైసీపీకి వ్య‌తిరేకంగా నిత్యం ఆందోళ‌న‌ల‌ను ఉధృతం చేస్తున్నారు. ఇందులో తెలుగు యువ‌త త‌న‌దైన శైలిలో వినూత్న నిర‌స‌న‌లు చేప‌డుతోంది.
 
వినియ‌క చ‌వితి సంద‌ర్భంగా పూజ చేసిన తెలుగు య‌వ‌త‌, గ‌ణేశుడికి ఏపీ సమ‌స్య‌ల‌ను ఏక‌రువు పెట్టింది. కొన్ని డిమాండుల‌తో కూడిన విన‌తి ప‌త్రాన్ని గ‌ణ‌ప‌తికి తెలుగు యువత అధ్యక్షుడు రవి నాయుడు స‌మ‌ర్పించారు. 
 
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ, ప్రజలని నువ్వే కాపాడాలని అంటూ గ‌ణేశుడిని వేడుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్దిని ప్రసాదించాలంటూ గణనాధుడికి విన్నవించుకున్నామ‌ని, తెలుగు యువత అధ్యక్షుడు రవి నాయుడు చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చ‌వితి వేళ క‌రోనా నిబంధ‌న‌లు పాటించండి... గ‌వ‌ర్న‌ర్ శుభాకాంక్షలు