Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వీళ్లు పోలీసులా? ఛీ.. ఛీ.. ఏపీ పరువు తీసేశారు.. క్రిమినల్‌కు విషెస్ చెప్పేందుకు పోటాపోటీ

ap police
, బుధవారం, 3 జనవరి 2024 (11:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు దిగజారిపోయారు. వీరు పోలీసులేనా అన్నంతస్థాయికి పడిపోయారు. తన వద్ద కొంతకాలం పాటు కారు డ్రైవరుగా పని చేసి మానేసిన దళిత యువకుడిని హత్య చేసి ఇంటికి డోర్ డెలివరీ చేసిన అధికార వైకాపాకు చెందిన శాసనమండలి సభ్యుడు అనంతబాబుకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీపడ్డారు. ఇందుకోసం ఒకరి వెనుక ఒకరు వరుసక్రమంలో నిల్చొని, పుష్పగుచ్ఛాలు ఇచ్చిమరీ శుభాకాంక్షలు చెప్పి ప్రసన్నం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఏపీ పోలీసుల తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎమ్మెల్సీ సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిలుపై బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. 
 
"దళిత యువకుడ్ని చంపి, బెయిల్‌పై బయట ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వాడికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు పోలీసులు ఇలా పోటీ పడ్డారు" అంటా కామెంట్స్ చేస్తున్నారు. "సిగ్గూ ఎగ్గూ లేని అధికారులు.. నేరస్థుల కొమ్ము కాసే ఇలాంటి వారు ఆ వ్యవస్థకే మాయని మచ్చ తెస్తున్నారు" అంటూ మరో నెటిజన్ పోస్ట్ చేశారు. 
 
"ఇదేనా పాలెగాడు జగన్ రెడ్డి రాజ్యంలో దళితులకి జరిగే న్యాయం? ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ముందు సాగిలపడ్డ ఏపీ పోలీసులు. ఈ ప్రభుత్వంలో బాధిత కుటుంబాలకు న్యాయం అనేది జరుగుతుందా? స్వయంగా జగన్ రెడ్డి, కోడి కత్తి కేసులో ఒక దళితుడికి అన్యాయం చేస్తుంటే, ఈ సైకో ముఠా కూడా ఇలాగే దళితులపై పడ్డారు" అంటూ తెలుగుదేశం పార్టీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. మొత్తంమీద ఏపీ పోలీసులు నడుచుకున్న తీరు ఇపుడు ప్రతి ఒక్కరినీ విస్తుపోయేలా చేస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో చలిగాలులు.. పొగమంచు.. రైళ్ల రాకపోకలు ఆలస్యం.. స్కూల్స్ బంద్