Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంత్రి కొడాలి నాని వీడియోను పరిశీలించి ఉత్తర్వులివ్వండి.. హైకోర్టును కోరిన ఎస్ఈసీ

మంత్రి కొడాలి నాని వీడియోను పరిశీలించి ఉత్తర్వులివ్వండి.. హైకోర్టును కోరిన ఎస్ఈసీ
, సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (15:51 IST)
ఏపీ మంత్రి కొడాలి నాని ప్రసంగించిన వీడియో ఫుటేజీని పరిశీలించి తగిన ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. అదేసమయంలో మరో మంత్రి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎమ్మెల్యే జోగి రమేశ్‌ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వ్యాజ్యాలతో మంత్రి కొడాలి నాని వ్యాజ్యాన్ని పోల్చి చూడలేమని ఎన్నికల సంఘం తరపు న్యాయవాది వ్యాఖ్యానించారు. 
 
కాగా, ఇటీవల మీడియా సమావేశంలో మంత్రి కొడాలి నాని ఎస్‌ఈసీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, కమిషనర్‌ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని మంత్రి కొడాలి నానికి ఎస్‌ఈసీ షోకాజ్‌ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. 
 
దానిపై మంత్రి ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఈ నెల 21వరకు మీడియాలోగానీ, సమావేశాలలో గానీ మాట్లాడకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషన్‌  ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మంత్రి కొడాలి నాని శనివారం హైకోర్టును ఆశ్రయించారు. వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు.
 
ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజుల ముందు విచారణ జరిగింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రశాంత్‌ వాదనలు వినిపిస్తూ.... 'ఎస్ఈసీ జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధం. మధ్యాహ్నం నోటీసులు ఇచ్చి, సాయంత్రంలోపు వివరణ ఇవ్వమన్నారు. రాజ్యాంగ వ్యవస్థల మీద గౌరవం ఉంది... ఎన్నికల సంఘం స్థాయిని తగ్గించేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు... అని పిటిషనర్‌ వివరణ ఇచ్చారు. ఈ వివరణను ఎస్‌ఈసీ పరిగణనలోకి తీసుకోకుండా ఉత్తర్వులు ఇచ్చింది' అని పేర్కొన్నారు. 
 
అయితే, ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్‌ వాదనలు వినిపిస్తూ... 'షోకాజ్‌ నోటీసుతో పాటు ఆధారాలను పిటిషనర్‌కు పంపాం. మంత్రి చేసిన వ్యాఖ్యల వీడియో ఫుటేజ్‌ను పరిశీలించాలి' అని కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి.. విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
 
ఎస్ఈసీ తరపు న్యాయవాది వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం... మీడియా సమావేశంలో పిటిషనర్‌ మాట్లాడిన వీడియో ఫుటేజ్‌ను, అందులోని అంశాలను రాతపూర్వకంగా కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. ఫుటేజ్‌లోని వివరాలను పరిశీలించకుండా ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేమని స్పష్టం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Petrol లీటరు రూ. 100, గ్యాస్ బండ ఒకటి రూ. 1000, గ్యాస్ బండతో మోదుతున్న మోదీ సర్కార్