Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా ప్రభావం, దీపావళి టపాసులపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు

Advertiesment
AP govt
కరోనా మహమ్మారి ఇంకా అదుపులోకి రాని నేపథ్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకుంటున్న దీపావళిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు ఆంక్షలను విధించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు మేరకు ఈ ఆంక్షలు విధిస్తున్నామని తెలిపింది.
 
శనివారం నాడు రాత్రి పూట కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాసులు పేల్చుకోవాలని తెలిపింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాకాయలను కాల్చేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అవి కూడా పర్యావరణానికి మేలు కలిగించే గ్రీన్ క్రాకర్స్ మాత్రమే పేల్చాలని తెలిపింది.
 
రాష్ట్రంలో కరోనా బాధితులు, పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్ననట్లు తెలిపింది. ఇక టపాకాయలు విక్రయించే షాపుల మధ్య దూరం తప్పనిసరి అని తెలిపింది. కొనుగోలుదార్లను కూడా 6 అడుగుల భౌతికదూరం పాటించేలా చూడాల్సిన బాధ్యత షాపు యాజమాన్యానికి ఇచ్చింది. ఈ షాపుల వద్ద పేలుడు స్వభావం కలిగిన శానిటైజర్లను వాడరాదని స్పష్టం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొదల్లో వివాహితతో ఎంజాయ్ చేసిన యువకుడు, ఉన్నట్లుండి పురుగుల మందు తాగాడు