Publish Date: Sat, 25 Mar 2023 (10:20 IST)
Updated Date: Sat, 25 Mar 2023 (10:21 IST)
ఏపీ మహిళలకు గుడ్ న్యూస్. వైఎస్సార్ ఆసరా మూడో విడత నగదును సీఎం జగన్ జమచేయనున్నారు. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మూడో విడత సాయాన్ని శనివారం విడుదల చేయనుంది.
వైఎస్సార్ ఆసరా పథకం కింద 78.94 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో రూ.6,419.89 కోట్ల మొత్తాన్ని వైఎస్ జగన్ జమ చేయనున్నారు.
ఏలూరు జిల్లా దెందులూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.