Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

31 నుంచి పల్నాడులో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన

Advertiesment
chandrababu naidu

ఠాగూర్

, శుక్రవారం, 27 డిశెంబరు 2024 (11:50 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన ఈ నెల 31వ తేదీన పల్నాడు జిల్లాలోని నరసరావు పేట మండలంలోని యల్లమంద గ్రామంలో చంద్రబాబు పర్యటించనున్నారు. యల్లమంద గ్రామంలో సీఎం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.ఆ రోజు రాత్రి అక్కడే బస చేసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటారు. పైగా, ఒక్క రోజు ముందుగానే సామాజిక పింఛన్లను ఇవ్వనున్నారు 
 
ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని చంద్రబాబు దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో యల్లమంద గ్రామంలో సభా వేదిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ముందుగా నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జనవరి 1న పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పులిపాడు గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని ప్రచారం జరిగింది. దీంతో ఆ గ్రామంలో ఏర్పాట్లు చేస్తుండగా, సీఎం పర్యటనలో మార్పు చోటుచేసుకుంది.
 
సీఎం పర్యటన ఖరారైన నేపథ్యంలో గురువారం జిల్లా కలెక్టర్ యల్లమంద గ్రామంలో పర్యటించారు. అక్కడ హెలిపాడ్ నిర్మాణానికి అనువైన స్థలంతో పాటు సభా వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనను ఆమోదించిన సీడబ్ల్యూసీ