Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై సుప్రీంలో ఏపీ పిటిషన్

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై సుప్రీంలో ఏపీ పిటిషన్
, గురువారం, 2 జులై 2020 (17:11 IST)
ఏపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ స్టే ఇవ్వాలని కోరింది. అయితే దీనిపై జులై 6వ తేదీ తర్వాత విచారణకు వచ్చే అవకాశముంది.

మరోవైపు ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పటికే కేవియట్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 8న ఏపీ ప్రభుత్వం వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది. నిఘా పరికరాలకు సంబంధించిన కాంట్రాక్ట్‌లో అవకతవకలకు పాల్పడ్డారంటూ సస్పెండ్ చేసింది.

ఆ సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయించారు. అందులో ఆయనకు చుక్కెదురైంది. 
అయితే క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

న్యాయస్థానం వెంకటేశ్వరరావుకు ఊరట కలిగించే విధంగా తీర్పు ఇచ్చింది. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మే 22న తీర్పు ఇచ్చింది. దీనిపై ఏపీ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖైరతాబాద్ గణేషుడు ఈసారి 27 అడుగులే