Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పర్యాటక ప్రాంతాల్లో మరో 300 వైన్ షాపులు, ఇదేనా మ‌ద్య‌నిషేధం?

Advertiesment
పర్యాటక ప్రాంతాల్లో మరో 300 వైన్ షాపులు, ఇదేనా మ‌ద్య‌నిషేధం?
, సోమవారం, 2 ఆగస్టు 2021 (12:02 IST)
జగన్ రెడ్డి చెప్పిన మద్యపాన నిషేదం హామీ ఏమైంది? మద్యం షాపులు పెంచట‌మేనా మద్యపాన నిషేధ‌మా? అని ఏపీ టీడీపీ నేత కింజరాపు అచ్చెన్నాయుడు ప్ర‌శ్నించారు.

ఉన్న మద్యం షాపులు చాలవన్నట్లుగా పట్టణాలు, పర్యాటక ప్రాంతాల్లో మరో  300 షాపులు ఏర్పాటు చేయటం ప్రజలను మోసం చేయటమే అన్నారు. గ్రామాల్లో మద్యం షాపు లేని బజారు ఉందా? మద్యాన్ని ఏరులై పారిస్తూ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చారు... జగన్ రెడ్డి తన కమిషన్ల కోసం  నాసిరకం బ్రాండ్లు అమ్ముతూ ప్రజల  ప్రాణాలతో చెలగాటమాడుతున్నార‌ని విమ‌ర్శించారు. 
 
మద్యంపై వచ్చే ఆదాయం చూపి ఏపీ అభివృద్ది కార్పోరేషన్ ద్వారా  రూ. 25 వేల కోట్లు అప్పు తెచ్చార‌ని, అప్పులు తెచ్చి అవి తీర్చలేక మద్యం రేట్లు పెంచి మందుబాబుల రక్తంతో, వారి కుటుంబాల కన్నీళ్లతో ఆ అప్పులు తీర్చాలని చూస్తున్నారా? అని ప్ర‌శ్నించారు. మద్యం ఆదాయం మత్తులో మునిగిన వైసీపీ ప్రభుత్వానికి మహిళలు మత్తు వదిలించటం ఖాయమ‌ని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కిలేశ‌పురం వాట‌ర్ ఫాల్స్ వ‌ద్ద బెజ‌వాడ గ్యాంగ్ వార్!