Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలోనే ఒకే ఉపాధ్యాయుడు వున్న స్కూళ్లతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం

Advertiesment
school children

ఐవీఆర్

, సోమవారం, 13 అక్టోబరు 2025 (23:56 IST)
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
దేశంలోనే ఒకే ఉపాధ్యాయుడు వున్న స్కూళ్లతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో వున్నది. ఏపీలో ఉన్న 12,912 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నట్లు గణాంకాలలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 33 లక్షలకు పైగా విద్యార్థులు 1 లక్షకు పైగా సింగిల్-టీచర్ పాఠశాలల్లో చదువుతున్నారు, అధికారిక డేటా ప్రకారం, ఆంధ్రప్రదేశ్ అత్యధిక సంఖ్యలో అటువంటి పాఠశాలలను నమోదు చేయగా, ఉత్తరప్రదేశ్ వాటిలో అత్యధిక సంఖ్యలో విద్యార్థుల నమోదుతో ముందుంది.
 
విద్యా మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2024-25 విద్యా సంవత్సరంలో, భారతదేశంలో ఒక్కొక్క ఉపాధ్యాయుడు నిర్వహించే 1,04,125 పాఠశాలలు ఉన్నాయి. అటువంటి పాఠశాలలు 33,76,769 మంది విద్యార్థులకు సేవలు అందిస్తున్నాయి. సగటున ఒక్కో పాఠశాలకు 34 మంది విద్యార్థులు. మొత్తం దేశ వ్యాప్తంగా ఒకే ఉపాధ్యాయుడు నడుపుతున్న పాఠశాలలు 104,125 కాగా ఒకే ఉపాధ్యాయుడు కలిగిన ప్రభుత్వ పాఠశాలలు ఉన్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ వున్నట్లు తేలింది.
 
దేశంలో ఒకే ఉపాధ్యాయుడుతో పనిచేస్తున్న పాఠశాలల సంఖ్య క్రింది విధంగా వుంది.
 
ఆంధ్రప్రదేశ్ - 12,912
ఉత్తరప్రదేశ్ - 9,508
జార్ఖండ్ - 9,172
మహారాష్ట్ర - 8,152
కర్ణాటక - 7,349
లక్షద్వీప్ - 7,217
మధ్యప్రదేశ్ - 7,217
పశ్చిమ బెంగాల్ - 6,482
రాజస్థాన్ - 6,117
ఛత్తీస్‌గఢ్ - 5,973
తెలంగాణ - 5,001

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రైవర్ రాయుడు వీడియోను నిన్ననే చూశా... నాపై కుట్ర జరుగుతోంది... ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి