Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Nara Lokesh: కొత్త ఉపాధ్యాయులు అంకితభావంతో విధులను నిర్వర్తించాలి: నారా లోకేష్

Advertiesment
Nara Lokesh

సెల్వి

, సోమవారం, 13 అక్టోబరు 2025 (18:41 IST)
ఏపీలో అనేక అడ్డంకులు, వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ మెగా డీఎస్సీ నియామకాలను నిర్వహిస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ చర్యల ద్వారా వేలాది మంది ఉద్యోగ ఆశావహుల కలలను ప్రభుత్వం సాకారం చేసిందని నారా లోకేష్ తెలిపారు.
 
రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో చేరనున్న 16,000 మంది కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులను నారా లోకేష్ అభినందించారు. లక్షలాది మంది విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో వారు కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. 
 
కొత్త ఉపాధ్యాయులు అంకితభావంతో తమ విధులను నిర్వర్తించాలని.. విద్యార్థుల వృద్ధిని పెంపొందించాలని నారా లోకేష్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగారం ధరలు పైపైకి.. రూ.2,613లు పెరిగి రూ.1.23లక్షలు చేరిన పసిడి