Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పంట కాలువలో స్కూల్ బస్సు బోల్తా.. ఇద్దరు విద్యార్థుల పరిస్థితి?

Bus Accident
, మంగళవారం, 15 ఆగస్టు 2023 (19:56 IST)
Bus Accident
బాపట్లలో పంట కాలువలో స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటనలో తొమ్మిది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. బాపట్ల జిల్లా కూచిపూడి-పెదపూడి మధ్య మంగళవారంనాడు పంట కాలువలో స్కూల్ బస్సు బోల్తా పడింది. 
 
అమృతలూరు మండలం కూచిపూడిలోని స్కూల్‌లో ఇండిపెండెన్స్ డే వేడుకల్లో విద్యార్థులు పాల్గొన్న అనంతరం తిరిగి ఇంటికి బస్సులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిందని స్థానికులు అంటున్నారు. 
 
ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులను తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంతలో రోడ్డు వెంట వెళ్తున్న ఓ వ్యక్తి వెంటనే స్కూల్ బస్సు అద్దాలు పగులగొట్టి విద్యార్ధులను బయటకు తీశాడు. ప్రమాదం జరిగిన బస్సులో 35 మంది విద్యార్థులున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పులిసిన ఇడ్లీలు పెట్టారు.. రోడ్డెక్కిన విద్యార్థులు.. ఎక్కడ?