Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను ప్రకటించిన సీఎం చంద్రబాబు

Advertiesment
Chandra babu

సెల్వి

, శనివారం, 18 అక్టోబరు 2025 (23:51 IST)
ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. దీపావళి కానుకగా ఒక డీఏను ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. మంత్రివర్గ ఉపసంఘం, ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం రూ. ఏడువేల డీఏలు పెండింగ్‌లు పెట్టిందన్నారు. 
 
వైసీపీలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆరోపించారు చంద్రబాబు. అయితే తమ సర్కారు డీఏను రెండు విడుతలుగా ఇస్తామని, నవంబర్‌లో రూ.105 కోట్లు, జనవరిలో రూ.105కోట్లు చెల్లిస్తామని వెల్లడించారు. ఉద్యోగులకు డీఏలకు దీని కోసం ప్రతి నెలా రూ, 160 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. 
 
ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుకగా ప్రమోషన్లు ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ ఎప్పుడైనా వాడుకోవచ్చునని వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగులది కూడా కీలక పాత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వయాగ్రా మాత్రలు కూరలో కలిపింది.. చివరికి శృంగారం చేస్తుండగా భర్త చనిపోయాడని?