డబ్బుల కోసం వేధిస్తున్నాడని కట్టుకున్న భర్తను కడతేర్చింది భార్య. ఈ ఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న కత్తి మౌనిక, సురేష్లకు ఇద్దరు పిల్లలున్నారు. కానీ కొన్నాళ్ల క్రితం కత్తి మౌనిక వ్యభిచార కూపంలోకి దిగింది. ఈ క్రమంలో భర్త సురేశ్ నిత్యం డబ్బుల కోసం వేధించడంతో విసిగిపోయిన మౌనిక అతన్ని చంపేయాలని డిసైడ్ అయిపోయింది. ఒకరోజు వయాగ్రా మాత్రలు కూరలో కలిపి చంపాలని ప్రయత్నించింది.
అయితే కూర వాసన రావడంతో సురేశ్ దానిని తినలేదు. దీంతో ముఠాతో కలిసి మరో స్కెచ్ వేసింది మౌనిక. మద్యంలో బీపీ, నిద్ర మాత్రలను పొడిగాచేసి అందులో కలిపింది. దీంతో అది తాగిన సురేశ్ అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. ఇదే సరైన టైమ్ అని భావించిన మౌనిక, సురేశ్ మెడకు చీరను బిగించి, కిటికి గ్రిల్కు వేలాడదీసి ఉరేసి చంపేసింది.
వెంటనే తన అత్తమామలను పిలిచి, శృంగారం చేస్తుండగా సురేష్ స్పృహ కోల్పోయాడని తన అత్తమామలకు చెప్పింది. వారు వెంటనే సురేష్ ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే సురేశ్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
అయితే పోలీసుల దర్యాప్తులో భార్యే హంతకురాలని తేలింది. లోతుగా దర్యాప్తు చేయగా మౌనిక అసలు నిజాన్ని బయటపెట్టింది. తానే అరిగెశ్రీజ, పోతు శివకృష్ణ, దొమ్మాటి ఆజయ్, వేముల రాధ, నల్ల దేవదాస్ సాయంతో చంపేశానని ఒప్పుకుంది. నిందితులను టూటౌన్ పోలీసులు అరెస్టు చేసి, గురువారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.