Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విహార యాత్రలో విషాదం - ప్రముఖ ఆర్కిటెక్ట్ ఇంజనీర్ మృతి

Advertiesment
adusumilli laxmana rao

ఠాగూర్

, సోమవారం, 9 జూన్ 2025 (08:49 IST)
హిమాలయ పర్వతారోహణ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ ఇంజనీర్ అడుసుమల్లి లక్ష్మణరావు మృతి చెందారు. అనుభవజ్ఞుల బృందంతో కలిసి ఆయన హిమాలయ యాత్రకు వెళ్లినప్పటికీ.. ప్రతికూల వాతావరణం, క్లిష్టపరిస్థితుల్లో చిక్కుకోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కృష్ణఆ జిల్లాకు చెందిన లక్ష్మణ రావు తన స్నేహితులు, సహోద్యోగులతో కలిసి హిమాలయ పర్వతారోహణకు వెళ్లారు. సాహస యాత్ర పట్ల అమితమైన ఆసక్తి కలిగిన ఆయన అనుభవజ్ఞులైన పర్వాతారోహకుల బృందంతో కలిసి ఈ యాత్రకు వెళ్లారు. హిమాలయాల్లో అత్యంత కఠినమైన శిఖరాలలో ఒకదానికి అధిరోహిస్తుండగా లక్ష్మణ రావు తీవ్ర అస్వస్థతకు లోనైనట్టు సమాచారం. ఊహించని విధంగా వాతావరణం తీవ్రంగా ప్రతికూలించడంతో పాటు క్లిష్టపరిస్థితులు ఎదురు కావడంతో ఆయన ప్రాణాలు విడిచాడు. 
 
కాగా, అమరావతిలోని లక్ష్మణరావు స్నేహితులు, సహోద్యోగులు మాట్లాడుతూ... మృతుడు తన వృత్తి పట్ల గొప్ప అంకితభావంతో ఉండేవారని, కృష్ణా ప్రాంతంలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. డిజైన్, ఇంజనీరింగ్ రంగాల్లో ఆయనకున్న నైపుణ్యం అందరికీ సుపరిచితమేనని, స్థానిక అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణవార్త తెలియగానే ఆర్కిటెక్టర్ రంగ ప్రముఖులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి చెంది సంతాపం తెలుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్