Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Andhra: గోదావరి నదిలో పెరుగుతున్న నీటి మట్టం.. భద్రాచలం వద్ద 48.7 అడుగులకు..?

Advertiesment
Godavari Pushkarau

సెల్వి

, మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (19:49 IST)
గోదావరి నదిలో వరద నీటి మట్టం పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏపీఎస్డీఎంఏ) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖార్ జైన్ మంగళవారం మాట్లాడుతూ, గోదావరి నదిలో వరద నీరు ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 10.2 లక్షల క్యూసెక్కులు దాటడంతో వరద నీరు పెరిగే అవకాశం ఉందని అన్నారు.
 
తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం వద్ద ఉన్న సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద ఉదయం 7 గంటలకు వరద నీరు ఈ పరిమాణాన్ని దాటిందని జైన్ చెప్పారు. గోదావరి నది ఉప్పొంగుతోంది. భద్రాచలం (తెలంగాణ) వద్ద, దాని నీటి మట్టం 48.7 అడుగులకు చేరుకుంది. దవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 10.2 లక్షల క్యూసెక్కులుగా ఉంది" అని జైన్ తెలిపారు. 
 
దవళేశ్వరం వద్ద మొదటి స్థాయి హెచ్చరిక కొనసాగుతోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో వరద నీటి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 6.4 లక్షల క్యూసెక్కులు దాటిందని తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండవ స్థాయి హెచ్చరిక కొనసాగుతోందని జైన్ చెప్పారు. అంతేకాకుండా, వరద నీటి ఇన్‌ఫ్లో కారణంగా కృష్ణా- గోదావరి నదుల నదీ తీర ప్రాంత ప్రజలను ఆయన అప్రమత్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏడో తరగతి విద్యార్థినిపై బాబాయి అత్యాచారం, గర్భవతి అయిన బాలిక