Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జేసీ ఓ రాక్షసుడంటున్న మహిళా మేయర్.... సూటయ్యే పనులు చేయాలి...

టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర రెడ్డిపై అనంతపురం మేయర్ స్వరూప తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, 'కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరిన తర్వాత పార్టీ

జేసీ ఓ రాక్షసుడంటున్న మహిళా మేయర్.... సూటయ్యే పనులు చేయాలి...
, బుధవారం, 20 డిశెంబరు 2017 (13:46 IST)
టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర రెడ్డిపై అనంతపురం మేయర్ స్వరూప తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, 'కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరిన తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి ఎంపీ అయితే బాగుంటుందని మేమంతా భావించి ప్రజల కాళ్లు పట్టుకుని ఓట్లు వేయించి గెలిపించాం. కానీ, ఇంత వరకు అనంతపురానికి అర్ధ రూపాయి కూడా ఆయన ఖర్చు పెట్టలేదు. తనకు వచ్చిన నిధులు కూడా ఖర్చు పెట్టలేదని ఆమె ఆరోపించారు. 
 
అంతేకాకుండా, అనంతపురం సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న ఆయన... చుట్టుపు చూపుగా 3 నెలలకు ఒకసారి నగరానికి వచ్చి తాము చేసిన అభివృద్ధి పనులను చూడకుండా విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన నల్ల అద్దాలు తీసి, తెల్లద్దాలు పెట్టుకోవాలని మేయర్ సూచించారు.  
 
రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటా అని చెబుతున్నారు. ఇలాంటి సమయంలోనైనా మంచి పనులు చేసి విశ్రాంతి తీసుకుంటే బాగుటుందని ఆమె సూచించారు. నల్లద్దాలు పెట్టుకోవడం వల్లే అనంతపురంలో తాము చేసిన అభివృద్ధి పనులు ఆయనకు తెలియడం లేదనీ, అందువల్ల ఆ అద్దాలు తీసి నగరంలో పర్యటిస్తే చేసిన పనులేంటో కనిపిస్తాయన్నారు 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జె.సి. బ్రదర్స్‌ను చూసి చంద్రబాబు వణుకుతున్నారా?