Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జె.సి. బ్రదర్స్‌ను చూసి చంద్రబాబు వణుకుతున్నారా?

జె.సి. బ్రదర్స్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. వీరి గురించి చెప్పిన వెంటనే అనంతపురం జిల్లా గుర్తుకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల పాటు రాజకీయం చేసిన ఈ అన్నదమ్ములు ఎపి విభజన తరువాత కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతపురం

జె.సి. బ్రదర్స్‌ను చూసి చంద్రబాబు వణుకుతున్నారా?
, బుధవారం, 20 డిశెంబరు 2017 (13:43 IST)
జె.సి. బ్రదర్స్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. వీరి గురించి చెప్పిన వెంటనే అనంతపురం జిల్లా గుర్తుకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల పాటు రాజకీయం చేసిన ఈ అన్నదమ్ములు ఎపి విభజన తరువాత కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతపురంలో ఎంపిగా అన్న జె.సి.దివాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యేగా జె.సి. ప్రభాకర్ రెడ్డిలు కొనసాగుతున్నారు. అసలు వీరు తెలుగుదేశం పార్టీలో చేరకుండా ఉంటే రాజకీయాలు వేరేగా ఉండేవి. ఫలితాలు తారుమారు అయ్యేవి. 
 
గత నెలరోజుల క్రితం జె.సి.దివాకర్ రెడ్డి ప్రభుత్వంపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపిగా ఉండి తాను చేసేది ఏమీ లేదంటూ తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పాడు. అధికార పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఇబ్బంది తప్పదని భావించిన చంద్రబాబు వెంటనే జె.సి.దివాకర్ రెడ్డి చెప్పిన సమస్యలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఆ తరువాత ఆయన వెనక్కి తగ్గారు. ఇప్పుడు తమ్ముడు జె.సి.ప్రభాకర్ రెడ్డి మరో డిమాండ్‌ను బాబు ముందుంచాడు. 
 
తాడిపత్రి నియోజకవర్గంలో గ్రానైట్ కార్విల్ ఎక్కువగా ఉన్నాయని వాటికి రాయల్టి తగ్గించాలని ఎప్పటి నుంచో ప్రభాకర్ రెడ్డి పట్టుబడుతున్నాడు. అయితే మంత్రులెవరూ దాన్ని పట్టించుకోకపోవడంతో వారిపైన ఫైరయ్యారు. దీంతో చంద్రబాబు గ్రానైట్ కార్విల్ రాయల్టిలో 20 శాతం తగ్గింపుకు ఆమోద ముద్ర వేశారు. జె.సి. బ్రదర్స్ ఏది చెబితే అది చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. అందే కాదు జె.సి. బ్రదర్స్‌ను చూసి బాబు వణికిపోతున్నారంటూ ఆ పార్టీలోని కొంతమంది నేతలు అనుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'అమ్మ' అస్త్రాన్ని ప్రయోగించిన దినకరన్ వర్గం .. కేసు నమోదుకు ఈసీ ఆదేశం