Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మ ఒడి డబ్బులు స్వాహా చేసిన వాలంటీర్

Advertiesment
Cash
, ఆదివారం, 6 ఆగస్టు 2023 (19:10 IST)
ఏపీలోని నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి సచివాలయం పరిధిలో ఓ వాలంటీర్ మోసానికి పాల్పడ్డాడు. అమ్మ ఒడి పథకం కింద ప్రభుత్వం ఇచ్చే నిధులను స్వాహా చేశాడు. మహిళను బురిడీ కొట్టించి ఈ నిధులను తన జేబులో వేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా ఏపీలోని వాలంటీర్లు చేస్తున్న అక్రమాలు, అన్యాయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ గ్రామంలో పని చేసే ఖాసీం పీరా అనే వాలంటీర్ అమ్మ ఒడి నిధులతో పత్తా లేకుండా వెళ్లిపోయాడు. బాధిత మహిళ వెల్లడించిన వివరాల మేరరకు.. 
 
నాగినేని గుంట గ్రామానికి చెందిన హుసేన్ బీ వద్ద వేలిముద్ర వేయించుకున్న వాలంటీర్ అమ్మ ఒడి నగదును తీసుకుని పారిపోయాడు. ఈ పథకం కింద ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో రూ.10 వేలు గత నెల 7వ తేదీన డ్రా చేసినట్టు బ్యాంకు అధికారులు ఆమెకు చెప్పడంతో ఖంగుతిన్నారు. వెంటనే ఆమె వాలంటీర్‌ను ప్రశ్నించగా ఒకదానికొకటి పొంతనలేని సమాధానం ఇచ్చాడు. పైగా ఇదిగో ఇస్తాను.. అదిగో ఇస్తాను అంటూ మభ్యపెట్టసాగాడు. దీంతో ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, మీడియాకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మల్లవల్లి రైతులకు అండగా ఉంటా.. ఆ రెండు పార్టీలు ముందుకు రావాలి : పవన్ కళ్యాణ్