Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏ క్షణమైనా వైకాపాలోకి టీడీపీ అమలాపురం ఎంపీ

ఏ క్షణమైనా వైకాపాలోకి టీడీపీ అమలాపురం ఎంపీ
, సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (09:55 IST)
సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలైన వైకాపా, టీడీపీల నుంచి వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే అధికార టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే, ఎంపీ విపక్ష వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మరో ఎంపీ కూడా ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన పేరు రవీంధ్ర బాబు. అమలాపురం ఎంపీగా కొనసాగుతున్నారు. 
 
నిజానికి కొంతకాలం క్రితం వరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి అధికార టీడీపీలోకి ఫిరాయిస్తున్న వారు మాత్రమే కనిపించారు. కానీ, ఇపుడు వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి చేరే వారి సంఖ్య ఎక్కువైంది. ఇటీవలే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌లు టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీలో చేరడంతో రాష్ట్రంలో వలస రాజకీయాలు ఒక్కసారి ఊపందుకున్నాయి. 
 
తాజాగా, అమలాపురం లోక్‌సభ సభ్యుడు పండుల రవీంధ్రబాబు వైసీపీ వైపు చూస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన పార్టీ మారనున్నారన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. తాను పార్టీ మారడం లేదని ఆయన ఇటీవల వెల్లడించినప్పటికీ, కొంతకాలంగా వైసీపీ నేతలతో ఆయన చర్చలు జరుపుతూనే ఉన్నారని తెలుస్తోంది. సో.. ఆయన కూడా ఏక్షణమైనా వైకాపాలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెఢీ టు అటాక్... ఆదేశాల కోసం వెయిట్ : భారత ఎయిర్‌ఫోర్స్ చీఫ్