Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెడీ టు అటాక్... ఆదేశాల కోసం వెయిటింగ్: భారత ఎయిర్‌ఫోర్స్ చీఫ్

రెడీ టు అటాక్... ఆదేశాల కోసం వెయిటింగ్: భారత ఎయిర్‌ఫోర్స్ చీఫ్
, సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (09:35 IST)
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు భారత వైమానిక దళాధిపతి బీఎస్.ధనోవా వెల్లడించారు. తాము ప్రభుత్వ ఆదేశాల కోసం వేచిచూస్తున్నట్టు తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఆదేశిస్తే ఏ క్షణమైనా పాకిస్థాన్‌పై దాడికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పాకిస్థాన్ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో 'వాయుశక్తి-2019' వైమానిక విన్యాసాలను ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వాయుసేన శక్తి సామర్థ్యాలను చాటిచెప్పేలా శత్రువుకు గట్టి జవాబు చెప్పేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. భారత్‌ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక, పరోక్షదాడులకు పాల్పడుతోందంటూ పాక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయహో పాకిస్థాన్ అంటూ నినాదాలు.. మక్కెలిరగ్గొట్టి బొక్కలో తోసిన కర్ణాటక పోలీసులు