Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాము కాటేసి వెళ్లిపోయింది.. దానికోసం వెతికి ప్రాణం పోయింది...

Advertiesment
Snake

సెల్వి

, మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (10:54 IST)
నాగార్జున యూనివర్శిటీ విద్యార్థి పాము కాటుతో ప్రాణాలు కోల్పోయాడు. పాము కాటు వేసిన వెంటనే ఆసుపత్రికి వెళ్లకుండా కాలయాపన చేయడం వల్లనే ఎంఏ విద్యార్ధి మృతి చెందినట్లు తెలుస్తోంది. పాము కాటేసిన వెంటనే ఆస్పత్రికి వెళ్లకుండా ఆ ఇద్దరూ పాము కోసం వెతకడం ప్రారంభించారు. 
 
అయితే మయన్మార్‌లో ఎవరైనా పాము కాటు వేస్తే, దానిని చంపి దాంతో పాటే ఆసుపత్రికి వెళుతారట. అంతేకాకుండా ఆ పాము జాతిని బట్టి వైద్యం అందిస్తారట. దాని కోసం వెతుకుతూ.. ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని తెలుస్తోంది. 
 
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సెప్టెంబర్‌ 7వ తేదీన మయన్మర్‌కి చెందిన కొండన్న (38) అనే బుద్ధిజం విద్యార్ధి రాత్రి 10.30 గంటల సమయంలో క్యాంపస్‌లో పుట్టగొడుగుల సేకరణ కోసం చెట్ల పొదల్లోకి వెళ్లాడు. అయితే అక్కడ ఓ పుట్ట వద్ద పుట్టగొడుగులు సేకరిస్తుండగా రక్త పింజరి పాము కొండన్నను కాటు వేసింది. పాముకోసం వెతుకుతూ కాలయాపన చేయడంతో  కొండన్న ప్రాణాలు కోల్పోయాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎమ్మెల్యే ఆదిమూలంను అరెస్టు చేసి.. తర్వాత నా వద్దకు రండి.. బాధితురాలు