Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాతో రా అంటూ బాలికను తీస్కెళ్లిన ఉపాధ్యాయుడు... గర్భవతిగా తిరిగొచ్చింది...

నాతో రా అంటూ బాలికను తీస్కెళ్లిన ఉపాధ్యాయుడు... గర్భవతిగా తిరిగొచ్చింది...
, బుధవారం, 31 జులై 2019 (16:14 IST)
ఈమధ్య కొంతమంది గురువులు వారి వృత్తికే మచ్చ తెస్తున్నారు. తమ వద్దకు విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు వచ్చే బాలికలపై వల విసిరి వారి జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు. ఇలాంటి తిరుపతిలో జరిగింది. కడపలో ఆ బాలిక పదో తరగతి చదివే సమయంలో ఆమెపై కన్నేసిన ఉపాధ్యాయుడు వీరయ్య ఆమెను ఫాలో అవుతూ వచ్చాడు. 
 
బాలిక పదో తరగతి ఉత్తీర్ణురాలై తిరుపతిలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. దీంతో సదరు ఉపాధ్యాయుడు ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్లాన్ వేశాడు. ప్రేమిస్తున్నాననీ, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన ఆ బాలిక ఏమీ తెలియని ఆ వయసులో గత దసరా శెలవులకు ఇంటి నుంచి అతడితో వెళ్లిపోయింది. పోతూపోతూ బంగారం, కొంత నగదు తీసుకుని వెళ్లిపోయింది. డబ్బు, బంగారంతోపాటు తమ కుమార్తె అదృశ్యమవ్వడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు.
 
ఇదిలావుండగా సదరు ఉపాధ్యాయుడు తన వెంట తీసుకెళ్లిన బాలికను తన భార్య అంటూ పరిచయం చేసి సికింద్రాబాద్‌ లోని ఓ ప్రాంతంలో ఓ గదె అద్దెకు తీసుకుని అక్కడే కాపురం చేశారు. ఫలితంగా బాలిక గర్భవతి అయ్యింది. మరోవైపు తమ బిడ్డ ఆచూకి లభించకపోవడంతో ఆమె పేరెంట్స్ జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ వద్ద మొరపెట్టుకున్నారు.

ఆయన కఠిన ఆదేశాలివ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి వీరయ్య-బాలిక ఆచూకి కనుగొని బాలిక స్వగ్రామమైన గిద్దలూరుకి తీసుకుని వచ్చారు. ఆడుతూపాడుతూ చదువుకునే తమ కుమార్తె ఉపాధ్యాయుడి చేతిలో మోసపోయి గర్భవతిగా తమ ముందుకు రావడంతో ఆమె తల్లిదండ్రులు ఆవేదన చెందారు. కాగా వీరయ్యపై పోలీసులు ఫోక్సో చట్టంపై కేసు నమోదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనసేన ఆటలో అరటిపండు కావడంతో ఏపీలో భాజపా మునిగింది...