Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమ పేరిట పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం.. పదేళ్ల జైలు శిక్ష

ప్రేమ పేరిట పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం.. పదేళ్ల జైలు శిక్ష
, మంగళవారం, 9 జులై 2019 (11:34 IST)
ప్రేమ పేరిట మోసాలకు పాల్పడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి లొంగదీసుకుని యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. ప్రస్తుతం ఆ నిందితుడికి న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. శిక్షతోపాటు రూ.60వేలు జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా మొదటి అదనపు ప్రత్యేక మహిళా సెషన్స్‌ న్యాయమూర్తి ప్రేమలత తీర్పు వెల్లడించారు. 
 
వివరాల్లోకి వెళితే.. వనస్థలిపురం సచివాలయనగర్‌కు చెందిన షేక్‌మహమ్మద్‌ జహంగీర్‌పాషా(29) లక్డీకాపూల్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో మేనేజరు. 2006-07లో హయత్‌నగర్‌ శివారులోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో ఆంగ్ల ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. ఆ సమయంలో పదో తరగతి విద్యార్థినిని ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పాడు. ఆ విద్యార్థిని ఇంటర్మీడియట్‌ చదివే సమయంలోనూ వెంటపడుతూ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. 2012 ఆమెను మభ్యపెట్టి అత్యాచారానికి వడిగట్టాడు. 
 
గర్భందాల్సిన ఆ యువతి పెళ్లి చేసుకోవాలంటూ నిలదీయగా అప్పటికే మరో యువతిని పెళ్లి చేసుకున్న జహంగీర్‌పాషా ముఖం చాటేశాడు. దీంతో ఆమె మీర్‌పేట పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. కోర్టు ముందు హాజరు పరిచారు. ఇంకా ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు అతనికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోంవర్క్ చూపించమన్నాడనీ... టీచర్‌ను కత్తితో పొడిచిపారేసిన విద్యార్థి