Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జులై 1న 65 లక్షల మంది పింఛన్‌దారులకు రూ.4.400 కోట్లు పంపిణీ

anam - babu

సెల్వి

, శుక్రవారం, 28 జూన్ 2024 (12:56 IST)
రాష్ట్ర వ్యాప్తంగా జులై 1న 65 లక్షల మంది పింఛన్‌దారులకు పెంచిన మొత్తం, బకాయిలతో కలిపి రూ.4,400 కోట్లు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. 
 
గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో ఒక్కో లబ్ధిదారునికి రూ.1000(రూ.3వేలు)తో పాటు రూ.4వేలు పెన్షన్‌ పెంచడం జరిగిందన్నారు. 
 
మొత్తం రూ.7,000, జూలై 1న చెల్లిస్తాం. వాలంటీర్లకు బదులుగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లాలో 3,19,961 మంది పింఛనుదారులు రూ.218.97 కోట్ల మేర లబ్ధి పొందుతున్నారని మంత్రి తెలిపారు. 
 
2024 ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ దశలవారీగా నెరవేర్చేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధంగా వున్నారని రామనారాయణరెడ్డి అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు.. సిఫార్సు లేఖతో 54 మందికి వీఐపీ బ్రేక్ దర్శనం