Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి.. డెంగ్యూ జ్వరంతో మృతి

పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి.. డెంగ్యూ జ్వరంతో మృతి
, శనివారం, 2 నవంబరు 2019 (11:34 IST)
డెంగ్యూ జ్వరంతో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. చిత్తూరు జిల్లాలో ఈ విషాధం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలోని నరసింహాపురం పంచాయతీ టీవీఎన్‌ఆర్‌పురంకి చెందిన కృష్ణం రాజు, రెడ్డమ్మల కుమార్తె చంద్రకళ (18)కు ఇటీవలే పెళ్లి కుదిరింది.  అక్టోబర్ 30న పెళ్లి చేసేందుకు వధువు, వరుడు తరుపు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. 
 
అయితే చంద్రకళకు డెంగ్యూ సోకడంతో తమిళనాడులోని షోళింగర్‌ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. పెళ్లిరోజు వరకు ఆమె కోలుకోకపోవడంతో పెళ్లిని కూడా వాయిదా వేశారు. బుధవారం వధువు, వరుడి తరపు వారు ఆస్పత్రికి చేరుకుని.. తొలుత వివాహం జరిపించాలని పట్టుబట్టారు. 
 
కానీ వైద్యులు అందుకు నిరాకరించడంతో ఆస్పత్రి నుంచి వెనుదిరిగారు. శుక్రవారం రాత్రి చంద్రకళ మృతి చెందడంతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. చంద్రకళ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగా బ్రదర్ నాగబాబు కూడా ఫైర్ అయ్యారే.. మరి రోజా ఏమంటారో?