Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ మూడు స్థానాలు మినహా 18 స్థానాలకు జనసేన అభ్యర్థుల ఖరారు!

pawan kalyan

వరుణ్

, సోమవారం, 25 మార్చి 2024 (09:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసే 21 అసెంబ్లీ స్థానాలకు గాను 18 చోట్ల అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. మరో మూడు స్థానాల్లో మాత్రం అభ్యర్థులను పెండింగ్‌లో ఉంచింది. అవనిగడ్డ, విశాఖ సౌత్, పాలకొల్లు నియోజవర్గాల్లో మాత్రం అభ్యర్థుల ఎంపిక ఇంకా ఓ కొలిక్కి రాలేదు.
webdunia


ఆరంభంలో ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదివారం రాత్రి మరో 11 మంది పేర్లను ఖరారు చేశారు. దీంతో మొత్తం 18 మంది అభ్యర్థులు ఖరారయ్యారు. అలాగే, ఆ పార్టీ పోటీ చేసే రెండు ఎంపీ స్థానాల్లో మచిలీపట్నం నుంచి బాలశౌరి, కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరును ప్రకటించిన విషయం తెల్సిందే.
webdunia


మూడు అసెంబ్లీ స్థానాలకు మాత్రం అభ్యర్థులను ఖరారు చేయాల్సివుంది. ఈ ముగ్గురిని కూడా నేడో రేపో ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని జనసేన పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా భార్య కారు చోరీ!!