Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బూతులు ఉపయోగిస్తే తోపులైపోరు : విజయసాయి రెడ్డి

Advertiesment
Vijayasai Reddy
, గురువారం, 21 అక్టోబరు 2021 (13:33 IST)
తెలుగుదేశం పార్టీ నేతలపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులు మాట్లాడితే తోపులైపోరు అంటూ మండిప‌డ్డారు. అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ ఉనికిని చాటుకునేందుకు ఆ పార్టీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ ఆయ‌న ప‌రోక్షంగా ప‌లు వ్యాఖ్య‌లు చేశారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హుందాతనాన్ని బలహీనతగా తీసుకోవద్దు. ప్రతి ఎన్నికల్లో చిత్తుగా ఓడారు. 2 వారాల్లో బద్వేలులో కూడా మీ బతుకేమిటో తెలిసిపోతుంది. ప్రజలు దేవుడిగా ఆరాధిస్తున్న వ్యక్తిపై దిగజారుడు భాషను ఉపయోగిస్తే తోపులైపోరు. జనం మధ్యకు వెళ్లాలి గాని పార్టీ ఆఫీసుల్లో ఏం పని?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
'సంక్షేమ పాలన చూసి ఓర్వలేక అడ్రస్ గల్లంతవుతుందని విపక్షం అడ్డదారులు తొక్కుతోంది. బూతులు తిడుతూ రాజకీయం చేస్తే ప్రజలు హర్షించరు. రెచ్చగొట్టే  విద్వేష రాజకీయాలకు కాలం చెల్లింది. తాడు బొంగరం లేని వారు తమాషా చేస్తారు. క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి' అంటూ పార్టీ శ్రేణులకు విజయసాయి రెడ్డి పిలుపునచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈశాన్య చైనాలోని రెస్టారెంట్‌ భారీ పేలుడు : ముగ్గురు మృతి