Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏటీఎం కేంద్రంలో ఉమ్మేసిన కరోనా వైరస్ రోగి... ఖాకీల సీరియస్

Advertiesment
ఏటీఎం కేంద్రంలో ఉమ్మేసిన కరోనా వైరస్ రోగి... ఖాకీల సీరియస్
, ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (13:58 IST)
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. అలాంటి వైరస్‌ సోకి బాధపడుతున్న ఓ వెధవ పనికిమాలిన చర్యకు పాల్పడ్డాడు. ఓ ఏటీఎం కేంద్రంలోకి వెళ్లి అక్కడ ఉమ్మ వేశాడు. దీంతో ఈ ఆ కేంద్రంలోకి డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు వెళ్లిన ఇతరులకు కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం పొంచివుంది. ఈ ఘటన కడప జిల్లా మైదుకూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కడప జిల్లా మైదుకూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు, పట్టణంలోని రాయల్ సర్కిల్‌లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్‌కు వచ్చాడు. లోపలికి వెళ్లి, ఏటీఎం డిస్‌ప్లే, నంబర్ బోర్డు తదితరాలపై లాలా జలాన్ని ఊశాడు. దీన్ని గమనించిన కొందరు, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, అతన్ని అరెస్ట్ చేసి, స్టేషన్‌కు తీసుకుని వెళ్లి, వైద్యులతో పరీక్షలు జరిపించారు. 
 
అతనికి జలుబు, దగ్గు ఉన్నాయని, 101 డిగ్రీల జ్వరంతో పాటు కరోనా లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయని వైద్యులు తేల్చారు. దీంతో వెంటనే ఏటీఎంను మూసివేసిన పోలీసులు, బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. ఈ యువకుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే కేసు నమోదు చేశామని, వైద్య చికిత్స తర్వాత విచారణ కొనసాగుతుందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా బాధితుడి ఇంట్లో చోరీ.. దర్యాప్తుకెళ్లిన ఖాకీలకు వైరస్...