Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

పుట్టినరోజు.. యువతిపై సామూహిక అత్యాచారం.. శరీరంపై గాయాలు లేవు కానీ..?

Advertiesment
Warrangal
, గురువారం, 28 నవంబరు 2019 (12:32 IST)
పుట్టినరోజున ఓ యువతిపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హన్మకొండలోని దీనదయాళ్‌నగర్‌కి చెందిన 19 ఏళ్ల యువతి బుధవారం ఉదయం గుడికి బయలుదేరింది. 
 
పుట్టినరోజు కావడంతో గుడిలో దేవున్ని దర్శించుకుని వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లింది. అలా వెళ్లిన యువతి.. రాత్రైనా ఇంటికి తిరిగిరాలేదు. ఫోన్ చేస్తే స్విచాఫ్. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చాలాచోట్ల వెతికినప్పటికీ ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఇదే క్రమంలో రాత్రి పది గంటలకు హంటర్‌రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్స్ సమీపంలో ఓ యువతి మృతదేహం పడివున్నట్టుగా సమాచారం అందింది. ఆమె కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునేసరికి.. ఆ యువతి విగతజీవిగా అక్కడ పడిపోయి ఉంది.

బిడ్డను అలా చూసి తట్టుకోలేకపోయిన తల్లిదండ్రులు రోదించారు. పుట్టినరోజే చివరి రోజైందా అంటూ విలపించారు. పోలీసులు యువతి మృతదేహాన్ని పరిశీలించగా.. శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. కానీ మర్మాంగం నుంచి తీవ్ర రక్తస్రావం జరిగినట్టు గుర్తించారు. 
 
యువతి మృతదేహం వున్న ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటం.. పక్కనే బీర్ సీసాలు ఉండటంతో.. ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎమ్మెల్యే ఆర్కే ప్రశ్నల వర్షం... బాబు పర్యటన తర్వాతే కొనసాగాలని..?